అమరావతి : తిరుపతి జిల్లాలోని పోలీస్ శిక్షణ కళాశాలలో కరోనా కలకలం రేపుతుంది . కళాశాలలో శిక్షణ పొందుతున్న వారిలో 11 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. వీరిలో ఐదుగురికి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నామని ప్రిన్సిపల్ రాధాకృష్ణ వెల్లడించారు. 105 మంది టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది ఈ కళాశాలలో శిక్షణ పొందుతున్నారు. ఏపీలో కొత్తగా 66 కేసులు నమోదు కాగా వారం రోజుల వ్యవధిలో సుమారుగా 86 కేసులు వచ్చాయి. కాగా ఇప్పటి వరకు 23 లక్షలకు పైగా కేసులు కరోనా కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 14,733 మంది చనిపోయారు.