తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో స్వామివారి చెంత భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 28 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. దర్శనానికి 4 గంటల సమయం పడుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి.
నిన్న శ్రీవారిని 62,351 మంది దర్శించుకోగా 31,473 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.99 కోట్లు వచ్చిందని తెలిపారు.