అమరావతి : తిరుమలలో(Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిత్యకళ్యాణుడు వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండిపోయాయి. అతిథి గెస్ట్హౌస్ వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు.
టోకెన్లు లేని భక్తులకు 18-20 గంటల్లో స్వామివారి దర్శనం అవుతుందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 67,785 మంది భక్తులు దర్శించుకోగా 27,753 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం (Hundi Income) రూ. 2.38 కోట్లు వచ్చిందన్నారు.