తిరుమల : తిరుమల(Tirumala ) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 12 కంపార్టుమెంట్ల ( Compartments) లో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం( Sarvadarsan) కలుగుతుందని టీటీడీ (TTD ) అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 65,991 మంది భక్తులు దర్శించుకోగా 21,959 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi Income) రూ. 3.57 కోట్లు వచ్చిందన్నారు.
గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
తిరుపతి : తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో జనవరి 26న నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు (Republic day) అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో ఉదయం 7 గంటలకు, తిరుపతిలోని పరేడ్ మైదానంలో ఉదయం 8.30 గంటలకు టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎవి.ధర్మారెడ్డి జాతీయ జెండాను (National Flag) ఎగురవేయనున్నారు.