అమరావతి : ప్రకాశం జిల్లా ఒంగోలు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మద్యం మత్తులో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ శివకృష్ణ ద్విచక్రవాహనంపై వచ్చి దినేశ్ అనే యువకుడిని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి.
కాగా చికిత్సపొందుతూ దినేశ్మృతి చెందగా కానిస్టేబుల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.