అమరావతి : ఏపీలోని కర్నూలు జిల్లాలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య (Constable Suicide) చేసుకున్నాడు. జిల్లాలోని ఆదోని పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సందీప్కుమార్ (32) బుధవారం ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డీఎస్పీ శివనారాయణ స్వామి, సీఐలు విక్రమ సింహ, శ్రీనివాస్ నాయక్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అయితే కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. పోలీసు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఆదోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.