అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అభ్యర్థుల (Congress Candidates) జాబితాను ప్రకటించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సమాది వద్ద నివాళి అర్పించి రాష్ట్రంలో ఐదుగురు ఎంపీ, 114 అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. కడప(Kadapa) లోక్సభ స్థానం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
కాకినాడ నుంచి పల్లం రాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రంరాజు, బాపట్ల (Bapatla) నుంచి జేడీ శీలం , కర్నూలు నుంచి రాంపుల్లయ్య యాదవ్ పోటీ చేస్తారని షర్మిల తెలిపారు. కుప్పం అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆవుల గోవిందరాజులు, నందికొట్కూరు నుంచి ఆర్డర్, చింతలపూడి నుంచి ఎలిజా పోటీ చేస్తున్నారు.