Tirumala Laddu | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి. క్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. తిరుమల అంటేనే అందరికీ గుర్తుకు వచ్చేది లడ్డూ ప్రసాదమే. అయితే, ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వులు ఉన్నట్లు ఎన్డీడీబీ సీఏఎల్ఎఫ్ ల్యాబ్ నిర్ధారించిన విసయం తెలిసిందే. ఈ ఏడాది జులైలో లడ్డూని ల్యాబ్కు పంపగా.. అదే నెల 17న నివేదిక ఇచ్చింది. సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజల నూనెతో పాటు చేప నూనె, జంతులకొవ్వు, పామాయిల్, పందికొవ్వు కొవ్వులు వాడినట్లుగా నివేదిక ఇచ్చింది. ఈ ల్యాబ్ నివేదికను టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి గురువారం మీడియాకు అందజేశారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో ఖచ్చితంగా సీనియర్గా విచారణ చేయిస్తామని ఆయన స్పష్టం చేశారు. పవిత్రంగా భావించే వెంకన్న లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును వినియోగించేలా కుంభకోణానికి పాల్పడ్డ వ్యక్తులు సర్వనాశనమైపోతారని మండిపడ్డారు. నాణ్యమైన నెయ్యిని కొనుగోలు చేయాలంటే కిలోకు రూ.1000 వరకు వెచ్చించాల్సి ఉంటుందని.. గత ప్రభుత్వం రూ.320 టెండర్లు పిలిచిందని ఆరోపించారు. నలుగురు వ్యక్తులకు టెండర్లు ఇచ్చారని.. నాణ్యతతో కూడిన నెయ్యిని రూ.320కి ఎవరైనా ఇస్తారా? అంటూ ఆనం ప్రశ్నించారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. చంద్రబాబు వ్యాఖ్యలపై విశ్వహిందు పరిషత్ స్పందించింది. ఇది తీవ్రమైన సమస్య అని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
వీహెచ్పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన హిందూ వ్యతిరేక చర్యలు, అకృత్యాల గురించి అందరికీ తెలుసునన్నారు. అయితే, కల్తీ నెయ్యి విషయంలో ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ నేతలు ఖండించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆరోపణలు నమ్మశక్యంగా లేవన్నారు. తాను వేంకటేశ్వరస్వామిని నమ్ముతానని.. అందరూ ఆయన భక్తులేనన్నారు. ఈ విషయంలో ప్రమాణం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. మరో వైపు మాజీ చైర్మన్ బీ కరుణాకర్రెడ్డి సైతం రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఈ ఆరోపణలు చేశారని కొట్టిపడేశారు. మరో ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ చేయించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
Breaking: Test report confirms beef fat, fish oil used in making laddus at Tirupati Temple.
Massive betrayal of Hindu Aastha! pic.twitter.com/J1hdV2J9MW
— Rahul Shivshankar (@RShivshankar) September 19, 2024