అమరావతి: కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ కి చెందిన నాయకులు ఆదివారం ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకులు కుప్పం ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, ఓటుకు రూ.5వేల చొప్పున పంపిణీ చేయిస్తున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యే లేళ్ల అప్పిరెడ్డి, నవ రత్నాలు వైస్ చైర్మన్ నారాయణమూర్తి ఆరోపించారు.
రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా 80శాతం మంది ప్రజలు జగన్ ప్రభుత్వానికే ఓటు వేస్తారని పేర్కొన్నారు. టీడీపీ నాయకులకు ఓటమి భయం వెంటాడుతుందని విమర్శించారు. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ న్యాయ స్థానాలను అవమాన పరిచేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు.