అమరావతి : ఏపీ ఎన్నికల రోజు, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై వైసీపీ(YCP) నాయకులు డీజీపీ(DGP) ని కలిసి ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా కొందరు పోలీసు అధికారులు టీడీపీతో కుమ్మక్కయ్యారని వారిపై చర్యలు తీసుకోవాలంటూ మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu), నాయకులు పేర్ని నాని, మేరుగు నాగార్జున తదితరులు డీజీపీకి వినతి పత్రం అందజేశారు.
ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో పోలీసులు (Police) పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. వైసీపీ ఓటర్లు ఎక్కువగా ఉన్న చోట పోలీసులను పెట్టి టీడీపీకి బలమైన గ్రామాల్లో పోలీసులను పెట్టలేదని విమర్శించారు. జిల్లాలో పనిచేస్తున్న పోలీసు అధికారులను మార్చిన గాని హింస ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. రాష్ట్రంలోని శాంతి భద్రతలపై అవగాహన లేని డీజీపీ, ఎస్పీలను పెట్టడం వల్ల హింస జరిగిందని ఆరోపించారు.
టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీ శ్రేణులపై దాడులు చేస్తే బాధితులపై కేసులు నమోదు చేయడం విచిత్రంగా ఉందని పేర్కొన్నారు. పురంధేశ్వరి చెప్పినట్లు పోలీసు అధికారులను మార్చినచోటే హింస ప్రణాళికబద్ధంగా జరిగిందని ఆరోపించారు.
,