తిరుపతి : ఈనెల మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీటీడీ ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు.
మార్చి 2న మధ్యాహ్నం 3 గంటలకు ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో క్విజ్ పోటీలు, 4న ఉదయం 10 గంటలకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో సంగీతంలో పోటీలు మహిళా సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ శ్రీవాణి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. గెలుపొందిన విజేతలకు 8న బహుమతులను అందజేస్తామని ఆమె పేర్కొన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పోటీలను విజయవంతం చేయాలని కోరారు.