అమరావతి : కరోనా మహమ్మారితో ఏపీలో మరణించిన వైద్యుల కుటుంబాలకు సైతం పరిహారం అందించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రాజు కోరారు. కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రోగులకు వైద్యులు విస్తృత సేవలందించారని ఆయన అన్నారు. దురదృష్టావశాత్తు కొవిడ్ బారిన పడి ఏపీలో 85 మంది వైద్యులు చనిపోయారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలన్నారు.
డెల్టా కంటే 4 రెట్లు వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కరోనా కంటే తీవ్రమైంది కాదని నివేదికలు వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం బూస్టర్ డోసు అవసరం లేదని తమ అభిప్రాయమన్నారు.