అమరావతి : ఈ నెల 25న విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయాన్నిమూసివేయనున్నారు. సూర్యగ్రహణం కారణంగా ఆలయాన్ని ఒకరోజు పాటు మూసివేయనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. 25వ తేదీ ఉదయం 10 గంటలకు అమ్మవారికి మహానివేదన, పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయ ద్వారాలను అర్చకులు మూసివేస్తారని వెల్లడించారు. తిరిగి మరుసటి రోజు 26న అమ్మవారి ఆలయ ద్వారాలను తెరవనున్నామని వివరించారు.
కాగా ఇంద్రకీలాద్రిపై వీఐపీలకు మాత్రమే పరిమితమైన అంతరాలయ దర్శన భాగ్యం ఇప్పుడు సామాన్యులకూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ప్రోటోకాల్ ఉన్న వారికే అంతరాలయ దర్శన భాగ్యం ఉండేదని, ఇక నుంచి అందరికీ ఈ అవకాశం ఉంటుందన్నారు. గతంలో ప్రోటోకాల్తో పాటు, అంతరాలయ దర్శనానికి రూ.300 టికెట్ ఉండేదన్నారు.
ఇప్పటి నుంచి అంతరాలయ దర్శనం కోసం రూ. 500 టికెట్ ఉంటే సరిపోతుందని, ప్రోటోకాల్ అక్కర్లేదని తెలిపారు. రూ. 500 ల టికెట్తో అంతరాలయ దర్శనం, రెండు అమ్మవారి లడ్డూ ప్రసాదం, ఆశీర్వచనం ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.