అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్ఆర్కే కళాశాలలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ సస్పెన్షన్కు దారితీసింది. ఇంజినీరింగ్ కళాశాలలో ప్రేమ వ్యవహారంలో విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. అంకిత్ అనే విద్యార్థిపై మరో నలుగురు విద్యార్థులు కర్రలు, పైపులతో చితకబాదారు. అంకిత్కు తీవ్రగాయాలు కావడంతో అతడిని భీమవరం ఆస్పత్రికి తరలించారు.
దాడి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు నలుగురు విద్యార్థులపై కేసు నమోదు చేశారు. స్పందించిన కళాశాల యజమాన్యం ఘటనలో బాధ్యులైన ఐదుగురిని సస్పెండ్ చేసింది. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కళాశాల ప్రిన్సిపల్ వెల్లడించారు.