హైదరాబాద్, మార్చి 11(నమస్తే తెలంగాణ): అసైన్డ్ భూముల కుంభకోణం లో ఏపీ సీఐడీ టీడీసీ అధినేత చంద్రబాబునాయుడుపై చార్జిషీట్ దాఖలు చేసింది. 4,400 కోట్ల మేర కుంభకోణం జరిగినట్టు సీఐడీ నిర్ధారించింది. ఈ కేసులో చంద్రబాబు ప్రధాన నిందితునిగా ఉన్నారు. ఆయనతోపాటు మాజీ మంత్రి నారాయణ పేరును కూడా సీఐడీ తన చార్జిషీట్లో పేర్కొంది.
రాజధాని అమరావతిలో 1,100 ఎకరాల అసైన్డ్ భూముల కబ్జా, క్యాపిటల్ సిటీ ప్లాన్తో కుంభకోణం జరిగినట్టు సీఐడీ పేర్కొంది. ఇందుకోసం రికార్డులను ట్యాంపరింగ్ చేశారని తెలిపింది. సుధీర్బాబు, అంజనీకుమార్ కూడా నిందితుల జాబితాలో ఉన్నారు.