విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ సమీపంలోని ఎండాడ వద్ద జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనాన్ని పోలీసు జీపు ఢీకొట్టింది. దీంతో త్రీ టౌన్ సీఐ ఈశ్వరరావు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం ధాటికి కారు ముందుభాగం ధ్వంసమయింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన కానిస్టేబుల్ను దవాఖానకు తరలించారు.
విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గురువారం తెల్లవారుజామున 3.40 గంటలకు ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం వెతుకుతున్నామని, జాతీయ రహదారిపై సీసీకెమెరాలను పరిశీలిస్తున్నామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.