అమరావతి: త్రిదండి చినజీయర్ స్వామివారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ను కలిశారు. ఈ సందర్భంగా రామానుజాచార్యులు అవతరించి వెయ్యేండ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని సీఎం జగన్ను ఆహ్వానించారు. చినజీయర్ స్వామికి స్వాగతం పలికిలిన సీఎం జగన్ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.
రామానుజా చార్యుని సహస్రాబ్ది ఉత్సవాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా 1035 కుండ శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకం, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.