అమరావతి : ఆంధ్రప్రదేశ్కు చెందిన వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి క్యాసినో వ్యవహారంపై స్పందించారు. మాజీ మంత్రిపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. తాను అప్పుడప్పుడూ క్యాసినోకి వెళ్తుంటానని, పేకాట ఆడుతానని తెలిపారు. అయితే చీకోటి ప్రవీణ్తో కాని హవాలాతో కానీ ఎలాంటి సంబంధం లేదని ఆయన వెల్లడించారు. తనపై వస్తున్న ప్రచారాలు అవాస్తవాలని తెలిపారు.
తనపై బురద చల్లే ప్రయత్నాలు చేయవద్దని కోరారు. తాను వాస్తవాలే చెబుతానని, డ్రామాలు చేయడం తనకు రాదని అన్నారు. కావాలంటే తనపై విచారణ చేసుకోవచ్చని తెలిపారు.