తిరుమల : హిమాచల్ప్రదేశ్(Himachal Pradesh) ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్(CM Sukvinder Singh) సుక్కు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కలియుగ ప్రత్యక్షదైవంగా కొలువబడుతున్న వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల (Tirumala) కు చేరుకుంటున్నారు. నిన్న స్వామివారిని 79,907 మంది భక్తులు దర్శించుకోగా 34,037 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi Income) రూ. 4.05 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు వెల్లడించారు. ఆదివారం కంపార్టుమెంట్లు నిండిపోగా భక్తులు ఏటీజీహచ్(ATGH) వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని తెలిపారు.