తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన తోపాటు ఆంధ్రప్రదేశ్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతు రాజ్ స్వామివారిని దర్శించుకున్నారు.
టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో కెఎస్ జవహర్ రెడ్డిలు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగ నాయక మండపంలో పండితులు వీరికి వేద ఆశీర్వాదంతోపాటు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు.