తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవకు ఉపయోగించే గొడుగులు చెన్నై నుంచి స్వామివారికి సన్నిధికి చేరుకున్నాయి. సమితి ట్రస్ట్ శ్రీనివాసన్ ఆధ్వర్యంలో ఆరు గొడుగులను తిరుమలకు తీసుకొచ్చి వైభవోత్సవ మండపంలో ఆలయ అధికారులకు అందజేశారు. ఈ నెల 24 నుంచి నిర్వహించను న్న బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి ఆహ్వానించారు. రాజ్ భవన్లో గవర్నర్ ను కలిసి శ్రీవారి తీర్థప్రసా దాలు, శేష వస్త్రాలను బహుకరించి, బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను గవర్నర్కు అందించి బ్రహ్మోత్స వాల విశిష్టతను వివరించారు.