Cheetah @ SV Versity | తిరుమల కొండపైనా, కాలినడక మెట్లపైనా ఇటీవల చిరుత దర్శనం ఇవ్వడం భక్తుల్లో భయాందోళన రేకెత్తించింది. తాజాగా సోమవారం తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ ఆవరణలోకి చిరుత రావడంతో విద్యార్థుల్లో కలకలం రేగింది. ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లోకి చిరుత రావడంతో విద్యార్థులు భయాందోళనతో పరుగులు తీశారు. తమ గ్రౌండ్ లోకి చిరుత వచ్చిందన్న సమాచారం పోలీసులకు ఇచ్చారు. యూనివర్సిటీ సెక్యూరిటీ అధికారులు కూడా ఫారెస్ట్ సిబ్బందికి తెలిపారు. దీంతో అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే వేద విశ్వవిద్యాలయంలో రాత్రి వేళ చిరుత సంచరిస్తున్నదని అధికారులు నిర్ధారించారు.
ఇంతకుముందు జూన్ 22న తిరుపతి తిరుమల దేవస్థానానికి కాలిక నడకన వెళ్లే మార్గంలో ఏడో మైలురాయి వద్ద ఐదేండ్ల బాలుడ్ని పట్టుకెళ్లడంతో అక్కడి వారు, పోలీసులు కేకలేయడంతో ప్రాణాపాయం తప్పింది. గాయపడిన బాలుడికి చికిత్స చేయించారు.
నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం వాసి దినేశ్, శశికళ దంపతులు తమ పిల్లలతో శుక్రవారం రాత్రి అలిపిరి నడక మార్గంలో తిరుమలకు బయల్దేరారు. నరసింహస్వామి ఆలయం వద్ద వారి కూతురు లక్షిత కనిపించలేదు. దీంతో దినేశ్, శశికళ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అనుమానం రావడంతో అటవీ సిబ్బంది గాలింపు చేపట్టారు. శనివారం ఉదయం ఆ చిన్నారి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. వరుస ఘటనల నేపథ్యంలో తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు.