Cheetah Attacks Boy | ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఘాట్ రోడ్డులో ఐదేండ్ల బాలుడిపై చిరుత పులి దాడి చేసింది. గురువారం నడక మార్గంలోని ఏడవ మైలురాయి వద్దకు వచ్చిన చిరుత.. ఐదేండ్ల బాలుడిపై దాడి చేసి, ఎత్తుకెళ్లింది.
ఈ ఘటనను చూసిన పోలీసులు కేకలేయడంతో భయపడి బాలుడ్ని వదిలేసి అడవిలోకి పారిపోయింది. తీవ్రంగా గాయపడిన బాలుడ్ని చికిత్స కోసం దవాఖానకు తరలించారు.
ఈ సమాచారం తెలిసిన వెంటనే అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐదేండ్ల బాలుడ్ని చిరుత ఎత్తుకెళ్లడంతో ఆ మార్గంలో వెళుతున్న భక్తులు భయాందోళనకు గురయ్యారు.