అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా పంచలింగాల చెక్పోస్టు వద్ద తనిఖీలో ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.1.25 కోట్ల సొమ్మును ప్రత్యేక పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాజమహేంద్రవరానికి చెందిన ఉదయ్ కుమార్ ఎలాంటి ఆధారాలు లేకుండా నగదు తరలిస్తున్నాడని వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హైదరాబాద్ నుంచి రాజంపేటకు వెళ్తున్న ప్రైవేటు బస్సును పంచలింగాల చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేశారు.
ఈ తనిఖీలో ఆధారాలు లేకుండా రూ. 1.25 కోట్లను తరలిస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతడిపై ప్రాథమికంగా కేసు నమోదు చేశామని, నగదుకు సంబంధించిన పక్కా ఆధారాలుంటే వాటిని తిరిగి అప్పగిస్తామని వివరించారు.