అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ప్లాజా వద్ద తనిఖీలో రూ. 4.76 కోట్ల నగదు ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం నుంచి గుంటూరు వెళ్తున్న పద్మావతి ట్రావెల్స్ బస్సును పోలీసులు తనిఖీ చేశారు. బస్సు సీట్ల కింద ఉన్న లగేజ్ క్యారియర్ను తెరవగా అందులో రూ. 4.76 కోట్ల నగదు, 350 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
బస్సు డ్రైవర్, క్లీనర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పట్టుబడిన నోట్లు నకిలీవా, నిజమైనవా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.