Srisailam | ఈ నెల ఐదో తేదీ నుంచి ఉదయాస్తమాన సేవ, ప్రదోషకాల సేవాకర్తలకు స్వామి వారి అంతరాలయం నుంచి మహా మంగళహారతి దర్శనం ఇవ్వాల్సి ఉంటుందని శ్రీశైలం దేవస్థానం తెలిపింది. ఉదయాస్తమాన సేవ, ప్రదోషకాల సేవాకర్తలకు ఒక్కో సేవకు ఆరు టికెట్లు ఇవ్వాల్సి ఉంటుందని దేవస్థానం ఈవో ఎస్ లవన్న శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కనుక స్థలాభావం వల్ల స్వామి అంతరాలయం నుంచి ఇతరులకు మహా మంగళహారతి దర్శనం కల్పించడం సాధ్యం కాదన్నారు. ఈ మార్పును భక్తులు గమనించాలని కోరారు.
ప్రస్తుతం అమల్లో ఉన్నట్లే మహా మంగళహారతి వేళలో సర్వదర్శనం క్యూలైన్లలో భక్తులకు దర్శనం కల్పించడం జరుగుతుందని ఈవో ఎస్ లవన్న తెలిపారు. కనుక మహా మంగళ హరతి దర్శనం సమయంలోనే సాధారణ భక్తులు క్యూ లైన్లలో సర్వదర్శనం చేసుకోవచ్చునన్నారు. అంతరాలయం నుంచి మహా మంగళహారతి దర్శనం పొందగోరు భక్తులు ఉదయాస్తమాన సేవ, ప్రదోషకాల సేవ టికెట్లు పొందాలని తెలిపారు.
భక్తులు ఉదయాస్తమాన సేవ, ప్రదోషకాల సేవ టికెట్ల కోసం www.srisailamdevasthanam.org ద్వారా సేవా రుసుము చెల్లించి టికెట్లు పొందొచ్చు. మిగతా సందర్భాల్లో ఈవో అనుమతితో కరంట్ బుకింగ్ ద్వారా ఈ టికెట్లు ఇ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో మిగిలిన ఉదయాస్తమాన సేవ, ప్రదోషకాల సేవ టికెట్లను గంగాసదన్లోని అర్జితా సేవ సెంటర్ నుంచి పొందాలని ఎస్ లవన్న తెలిపారు.