అమరావతి : ఏపీలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల సమయాలను మార్పు లు చేస్తు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 4 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 7.30 నుంచి ఉదయం 11.30 గంటల వరకు పాఠశాలలను నిర్వహిం చాలని ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 27 నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి ఆది మూలపు సురేశ్ వెల్లడిం చారు.
మే 6 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరుపుతున్నామని వివరించారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదు అవుతున్నాయి. విశాఖపట్నంలో నిన్న 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు అయ్యింది .