అమరావతి : సాధ్యం కాని హామీలు ఇస్తున్న చంద్రబాబు మేనిఫెస్టోకు శకుని చేతిలో పాచికలకు తేడా లేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ (CM Jagan) విమర్శించారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో నిర్వహించిన వైసీపీ సిద్ధం భారీ బహిరంగ సభలో మాట్లాడారు. చంద్రబాబు (Chandra Babu) ఇస్తున్న హామీలు అమలు చేయాలంటే దాదాపు 87 వేల కోట్ల రూపాయలు అవసరముంటుందని వెల్లడించారు.
తాము ఐదేండ్లలో 2.70లక్షల కోట్లు పేదల సంక్షేమానికి డీబీటీ ద్వారా అందించామని పేర్కొన్నారు. మళ్లీ అధికారంలోకి వైసీపీ(YCP) వస్తేనే ఈ పథకాలు కొనసాగుతాయని, చంద్రబాబు వస్తే రద్దు అవుతాయని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నామని స్పష్టం చేశారు. పేదవాడి భవిష్యత్ మారాలన్నదే తమ లక్ష్యమని, చరిత్ర ఉన్నంత కాలం హిస్టరీ బుక్లో తన పేరు ఉండాలన్నదే కోరిక అని తెలిపారు. తనకు అధికారం వ్యామోహం కాదు. అధికారం పోతుందనే భయం ఎప్పుడూ లేదని అన్నారు.
పేదోడికి మరింత మంచి చేయాలనే ఉద్దేశ్యంతో త్వరలోనే మేనిఫెస్టో (Manifesto) ఉంటుందని ప్రకటించారు. తాము గతంలో మాదరిగా చేయగలిగిందే చెప్తాం. చేసిందే చెప్తామని వివరించారు. నేను మాట ఇచ్చానంటే తగ్గేదేలే’ దని అన్నారు. బాబుకు ఓటేయడమంటే.. చంద్రముఖిని ఇంటికి తెచ్చుకోవడమేనని ఎద్దేవా చేశారు. ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి. సైకిల్ ఇంటి బయట. తాగేసిన టీ గ్లాస్ సింక్లోనే ఉండాలని ఆయన టీడీపీ, జనసేనల పార్టీ గుర్తులనుద్దేశించి వ్యాఖ్యనించారు.