అమరావతి : ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కుప్పం ద్రవిడ వర్సిటీ భూముల్లో అక్రమ మైనింగ్ జరుగుతుందని ఫిర్యాదు చేశారు. పర్యావరణ విధ్వంసంతో పాటు వన్యప్రాణులు చనిపోతున్నాయని పేర్కొన్నారు. వర్సిటీ భూముల్లో అక్రమ మైనింగ్ అడ్డుకుని పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. అక్రమ మైనింగ్కు ద్రవిడ యూనివర్సిటీ హబ్గా మారిందని వెల్లడించారు.
వర్సిటీకి చెందిన 1100 ఎకరాల్లో అక్రమ మైనింగ్ కొనసాగిస్తున్నారని లేఖలో వివరించారు. బ్లాస్టింగ్, అక్రమ రవాణాతో వన్యప్రాణులు చనిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ పక్షి నెమళ్లతో పాటు అరుదైన జంతుజాలం నశిస్తోందని తెలిపారు. ఆహారంలోనూ నాణ్యత లోపించి ఇటీవల వందల మంది అస్వస్థతకు గురయ్యారని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో రోజురోజుకు వర్సిటీ ప్రతిష్ట దెబ్బతింటుందని అన్నారు. వర్సిటీలో పరిస్థితులను చక్కదిద్దేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని గవర్నర్ను చంద్రబాబు కోరారు.