అమరావతి: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిపై, సీఐడీ వేధింపులపై ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వరరావు, సాంబశివరావును సీఐడీ పోలీసులు వేధించారని ఆరోపించారు. అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి నోటీసుల పేరుతో వేధించారని ఫిర్యాదు చేశారు.
రాష్ట్ర పోలీసులు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా సీఐడీ పోలీసులు వ్యవహరించారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను ప్రభుత్వం రాజకీయ వేధింపులకు గురిచేస్తోందని మండిపడ్డారు.టీడీపీ శ్రేణులపై బెదిరింపు చర్యలకు దిగుతున్నారని అన్నారు. కుట్ర చేసిన సీఐడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దౌర్జన్యాలకు సంబంధించిన వీడియోలను లేఖకు జతచేశారు.