అమరావతి : గోబెల్స్ ప్రచారం ద్వారా విజయం సాధించాలని చేస్తున్న ప్రయత్నాల్లో చంద్రబాబు ఏనాడు విజయం సాధించలేరని వైసీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. ప్లీనరీకి హాజరైన ప్రజలపై విపరీతమైన ధ్వేషం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్లీనరీ ఆగిపోతే బాగుండేనని చంద్రబాబు సైకోలా ఆలోచించారని విమర్శించారు. ప్లీనరీ విజయానికి కృషి చేసిన అన్ని శాఖల వారిని అభినందించారు.
వేమూరు నియోజకవర్గానికి చెందిన దినేశ్ అనే వైసీపీ వలంటీర్ ప్లీనరీకి వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదవశాత్తు బస్సు కింద పడి మరణించాడని తెలిపారు. వైసీపీ తరుఫున రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నామని తెలిపారు. మృతుడి కుటుంబానికి నియోజకవర్గ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున సహాయం అందజేస్తారని వివరించారు. .