అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో కనకదుర్గమ్మను దర్శనం చేసుకున్నారు. 73వ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆలయాన్ని దర్శించుకుని అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల తరఫున పోరాడే శక్తి, సామర్థ్యం ఇవ్వాలని, ప్రజల పక్షాల నిలబడి, ప్రజలకు ఉండే ఇబ్బందులను తొలగించే తెలివి తేటలను ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.
తాత్కాలిక ఇబ్బందులను, దీర్ఘకాలంలో తెలుగుజాతికి పూర్వ వైభవం రావాలని కోరుకున్నానని, తప్పకుండా ఈ విషయంలో విజయసాధిస్తామన్నారు. ప్రజలకు పునరంకితం కావాలని , ప్రజలకు అండగా నిలవడానికి రాజీలేని పోరాటం చేసేందుకు ఆలయానికి వచ్చానని తెలిపారు.
చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, బొండా ఉమ, యరపతినేని, టీడీ జనార్ధన్ అధినేతకు శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతిలోని అభిలాండం వద్ద పూజలు నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర మీడియా సమన్వయ కర్త శ్రీధర్ వర్మ 720 కొబ్బరికాయలు కొట్టారు. అలిపిరి శ్రీవారి పాదాల వద్ద టీడీపీ శ్రేణులు 1, 116 కొబ్బరికాయలు కొట్టారు.