Chandrababu | అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్కు ముందే ఏపీలో రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తమ ప్రచారాన్ని మొదలుపెట్టేశారు. 175 అసెంబ్లీ స్థానాలకు 175 గెలవడమే టార్గెట్గా పెట్టుకున్న వైసీపీ కూడా తాజాగా ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టింది. ముఖ్యంగా చంద్రబాబును కుప్పంలో ఓడించడమే వైసీపీ టార్గెట్గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కుప్పంపై ఫోకస్ చేసిన జగన్.. కుప్పం బాధ్యతలను ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఈ సందర్భంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కుప్పంలో చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అందుకే మరోచోట పోటీ యోచనలో ఉన్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకే గ్యారంటీ లేదు.. ఇంకా ఎవరికి గ్యారెంటీ ఇస్తారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ముసుగులో జగన్ కుటుంబాన్ని చంద్రబాబు చీల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు స్క్రిప్టునే షర్మిల చదువుతున్నారని అన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వచ్చేది జగన్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు.