అమరావతి : ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆదివారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ సమావేశ మందిరంలో కేంద్ర బృందంతో సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యామ్ పూర్తికాకుండా డయాఫ్రం వాల్ కట్టారని ఆరోపించారు. దీంతో డయాఫ్రం వాల్ ఖర్చు రూ. 2,500 వేల కోట్ల అంచనాలకుపెరిగిందని వెల్లడించారు.
కాఫర్ డ్యామ్ నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్ చేపట్టి చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారని పేపర్కొన్నారు. గత గత ప్రభుత్వ తొందరపాటు చర్యలతో ప్రాజెక్టు మరింత ఆలస్యం అవుతుందని వివరించారు.