అమరావతి : కడప జిల్లా బద్వేల్లో( Badvel incident ) యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థిని ( Inter Student) ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలికావడంపై ట్విట్టర్(Twitter) వేదిక ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.
వేగంగా విచారణ పూర్తి చేసి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని సిఎం ఆదేశించారు. ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ( Fast Track Court) విధానంలో ఈ కేసు విచారణ పూర్తి చేసి నిందితుడికి శిక్షపడేలా చూడాలని సూచించారు. ఘటనలో నేరస్తుడికి మరణ శిక్ష స్థాయి శిక్ష పడేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
మహిళలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసేవారికి ఈ ఘటనలో పడే శిక్ష ఒక హెచ్చరికగా ఉండాలని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడం అంటే, హంతకుడిని త్వరగా, చట్టబద్దంగా శిక్షించడమేనని వెల్లడించారు.