అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandra Babu ) తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు రంజాన్ (Ramzan) పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు అతిపెద్ద పండుగ రంజాన్లో ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లింలపై అల్లా కరుణ ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
ప్రతి ముస్లిం కుటుంబానికి ఆనంద, ఐశ్వర్యాలు భగవంతుడు ప్రసాదించాలని వేడుకున్నారు. ముస్లింల సంక్షేమానికి , అభివృద్ధికి టీడీపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. కఠిన ఉపవాసం, ప్రార్థనలు, దానధర్మాలు సమత, మమతనఉ పెంచుతాయని తెలిపారు.