అమరావతి : ఏపీ రైతాంగాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు(Chandra Babu) దారుణంగా మోసం చేశారని సీఎం వైఎస్ జగన్ (CM Jagan) ఆరోపించారు. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి రైతులకు ఎలాంటి మేలు చేయలేదని విమర్శించారు. వైఎస్సార్ రైతు భరోసా, రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నుంచి బటన్ నొక్కి జమ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచేందుకు అనేక హామిలిస్తున్న బాబు మాటాలను నమ్మవద్దని కోరారు. బ్యాంకుల్లో బంగారం రావాలంటే బాబే ముఖ్యమంత్రి కావాలన్నారు. రుణాలు మాఫీ(Loan Free) చేస్తానని చెప్పి చివరకు రుణమాఫీ పత్రాలు ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. సున్నా వడ్డీ పథకాన్ని ఎగ్గొట్టగా వైసీపీ ప్రభుత్వమే వాటిని చెల్లించిందని పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వం గడిచిన ఐదేండ్లలో 19 లక్షల మంది రైతులకు 9 గంటలపాటు నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని, ఉచిత విద్యుత్ కింద ప్రతి రైతుకు రూ.45వేల మేర మేలు జరుగుతుందని అన్నారు.