Chandra Babu | మెగాస్టార్ చిరంజీవిపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ చిరంజీవికీ, తనకు మధ్య సత్సంబంధాలే ఉన్నాయని, ఇప్పటికీ టచ్లోనే ఉన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఒకవేళ చిరంజీవి గనక ప్రజారాజ్యాన్ని స్థాపించి ఉండకపోతే, టీడీపీ కచ్చితంగా అధికారంలోకి వచ్చి ఉండేదని పేర్కొన్నారు. పోరాడటం అనేది రాజకీయంలో ఓ ఆట అని బాబు పేర్కొన్నారు.
సినిమా టిక్కెట్ల విషయంలో అనవసరంగా టీడీపీని లాగుతున్నారని బాబు తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఈ వివాదంలోకి అసలు టీడీపీని ఎందుకు లాగారని సూటిగా ప్రశ్నించారు. తెలుగు దేశానికి చిత్ర పరిశ్రమ ఎప్పుడూ సహకరించలేదని, తనకు వ్యతిరేకంగా కూడా చాలా సినిమాలు వచ్చాయని బాబు పేర్కొన్నారు.