అమరావతి : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలహీనపడింది. ఇది సాయంత్రానికి వాయుగుండంగా మారే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ ఎల్లుండికి తుఫానుగా మారే అవకాశముందని వెల్లడించింది. దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరా దగ్గర తుఫాను ప్రభావం ఉంటుందని శాఖాధికారులు తెలిపారు.
దీని వల్ల దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్ష సూచన ఉందన్నారు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఈనెల 8 నుంచి 10 వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. ఈనెల 10 వరకు జాలరులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది.