తిరుపతి : తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్దగల శ్రీ లక్ష్మీనారాయణస్వామివారి ఆలయంలో ఇవాళ్టీ నుంచి 24వ తేదీ వరకు జరుపతలపెట్టిన పవిత్రోత్సవాలను ఆగమ పండితుల సూచనల మేరకు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కాగా తిరుమల లో 7 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచియున్నారు. వీరికి 8 గంటల్లో దర్శనం కలుగుతుందని వివరించారు.
నిన్న తిరుమలలోని శ్రీవారిని 81,523 మంది భక్తులు దర్శించుకోగా 37,100 మంది తలనీలాలు సమర్పించికున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ. 4.65 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.