అమరావతి: ఏపీ ఎన్నికల సంఘం సీఈవో ఎంకే మీనా (CEO Meena) గుంటూరులోని స్ట్రాంగ్ రూమ్లను సోమవారం పరిశీలించారు. నాగార్జున వర్సిటీలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ (Strong Rooms) లను కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి, ఎస్పీ తుషార్తో కలిపి పరిశీలించారు.
అనంతరం జూన్ 4వ తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఈవో పాల్గొన్నారు. ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ ఏర్పాట్లు చేయాలని సీఈసీ రాష్ట్రాల సీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది .