శ్రీశైలం : కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా బుధవారం శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన ఆయనకు దేవస్థానం ఈవో లవన్న రాజగోపురం వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం మల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవారి దర్శనం చేయించి, అభిషేకంతో పాటు అమ్మవారికి కుంకుమార్చన చేయించారు.
అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆశీర్వచన మండపంలో అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేసి, శేషవస్త్రంతో సత్కరించారు. అంతకు ముందు క్షేత్రానికి వచ్చిన గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శికి భ్రమరాంబ అతిథిగృహం వద్ద కలెక్టర్ కోటేశ్వర్రావు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్ టూరిజం, పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోప్ వే, శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి బోటింగ్ చేశారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ టూరిజం పర్యాటక అభివృద్ధి సంస్థకు సంబంధించిన రోప్ వేలో వెళ్లి అర కిలోమీటరులో ఉన్న పాతాళ గంగ వరకు ప్రయాణించారు. రోప్ వే వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పాతాళ గంగ వద్ద ఉన్న బోటులో కోటేశ్వర రావు, జాయింట్ కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్, నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్తో కలిసి బోటింగ్ చేశారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం పర్యాటక అభివృద్ధి సంస్థకు సంబంధించిన గైడ్ శ్రీశైలం ప్రాజెక్టు, ఎడమ, కుడి పవర్ హౌస్లు, కృష్ణా నది అందాలు, పాతాళ గంగ, భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల చరిత్ర, నల్లమల అటవీ ప్రాంతంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శికి కలెక్టర్ వివరించారు.