Srisailam | శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను నాగర్కర్నూలు ఎమ్యెల్యే రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్ జస్టిస్ లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. వారు శనివారం కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ శ్రీకృష్ణరాయ గోపురం వద్దకు చేరుకున్నారు. వీరికి ఏఈవో మోహన్, సూపరింటెండెంట్ రవి కుమార్, వేదపండితులు, అర్చకులు ఆలయ మర్యాదలతో తిలక ధారణ చేసి ఘన స్వాగతం పలికారు.
అనంతరం స్వామివారి గర్బాలయంలో నాగర్కర్నూలు ఎమ్యెల్యే రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్ జస్టిస్ లక్ష్మీనారాయణ అభిషేకం చేయించారు. అటుపై బిల్వార్చన చేసుకుని అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన హారతులు అందుకున్నారు.
ఆలయంలోని పరివార దేవతలను దర్శించుకున్న తరువాత ప్రాకార మండపంలో వేదాశీర్వచనాలు వల్లించిన ప్రధానార్చకులు అభిషేక జల తీర్థప్రసాదాలు, స్వామిఅమ్మవార్ల ఙ్ఞాపికను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్యవైశ్య సంఘం – మల్లికార్జున అన్నసత్ర సంఘం ప్రధాన కార్యదర్శి బలుస శ్రీరాములు, వైసీపీ రాష్ట్రనాయకులు రజాక్ పాల్గొన్నారు.