అమరావతి : వైఎస్ వివేకానందా రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ, వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్రెడ్డి (MP Avinash reddy ) కి సీబీఐ (CBI) షాక్ ఇచ్చింది. అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. నా తండ్రిపై ఇటీవల అవినాష్ అనుచరులు దాడులకు పాల్పడ్డారని, జైలులో ఉండగా నాకు 20 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఆశ చూపారని హత్య కేసులో కీలక సాక్షి, అప్రూవర్ దస్తగిరి (Dastagiri) తెలంగాణ హైకోర్టు లో వేసిన పిటిషన్ వేశారు. పిటిషన్ మేరకు సీబీఐ కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈమేరకు అవినాష్ ముందుస్తు బెయిల్ రద్దు అంశం గురువారం విచారణకు వచ్చింది. దీంతో ఇప్పటికే అవినాష్రెడ్డి బెయిల్ షరతులు (Bail Conditions) ఉల్లంఘిస్తూ సాక్షులను, నిందితులను ప్రభావితం చేశారని ఆరోపించింది. వివేకా హత్య కేసులో కీలక సాక్షి, అప్రూవర్ దస్తగిరిని, అతడి కుటుంబ సభ్యులను అవినాష్ బెదిరిస్తున్నట్లు దస్తగిరి ఫిర్యాదు చేశారని కోర్టుకు వివరించింది. దస్తగిరి, సాక్షులను కాపాడాలంటే అవినాష్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరడం ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.