అమరావతి:ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) ఖాతాలను ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలపై గుంటూరులోని ఈపీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో పలువురు అధికారులపై సీబీఐ కేసులు నమోదు చేసింది. గుంటూరు, విజయవాడ, ఒంగోలు, చీరాల, గుంటుపల్లిలో ఈపీఎఫ్ అధికారుల ఇండ్లలో సీబీఐ విస్తృతంగా సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈపీఎఫ్ అధికారులు కొందరు ప్రైవేట్ కన్సల్టెంట్లతో కుమ్మక్కయ్యారని, క్లెయిమ్లు, సర్వీసులు, ఉద్యోగుల బకాయిల చెల్లింపులో అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ గుర్తించింది.
గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే తదితర మొబైల్ వాలెట్ యాప్స్ ద్వారా భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఆధారాలు సేకరించింది. ఈపీఎఫ్ అధికారులపై అక్రమాలకు పాల్పడినందుకు నాలుగు కేసులు నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది.