హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి శనివారం సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. గత నెల 28న ఆయన హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు వాట్సప్ ద్వారా తాజాగా నోటీసులు పంపారు. తనకు నోటీసులు అందిన విషయం వాస్తవమేనని ఎంపీ ధ్రువీకరించారు. ఆయనకు రెండోసారి నోటీసులివ్వడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.