అమరావతి : నెల్లూరు జిల్లాలో ఇద్దరు ఉపాధ్యాయులు తృటిలో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నారు. జిల్లాలోని పొదలకూరు మండలం నావూరు పెదవాగు మీదుగా పాఠశాలకు వెళ్తున్న ఉపాధ్యాయుల కారు బుధవారం ప్రమాదవాశాత్తు అదుపుతప్పి వాగులో పడి కొట్టుకుపోయింది. అప్రమత్తమైన ఉపాధ్యాయులు కారు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. వాగులో కొట్టుకుపోయిన కారును స్థానికులు వెలికితీశారు.