అమరావతి: ఏపీలో రోజురోజుకూ పెరిగిపోతున్న గంజాయి రవాణాపై టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప మాట్లాడారు. గత మూడేండ్లు ఆంధ్రప్రదేశ్లో గంజాయి రవాణా మూడురెట్లు పెరిగిందని పార్లమెంట్లో స్వయాన మంత్రి ప్రకటించడం ఏపీలో గంజాయి రవాణా, పెంపకంపై పరిస్థితిని తెలియజేస్తుందని ఆరోపించారు.
దేశంలో పలుచోట్ల పట్టుబడుతున్న గంజాయి మూలాలు ఏపీలో ఉండడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు గంజాయిపై మాట్లాడితే కేసులు పెట్టి భయపెట్టిస్తున్నారని ఆరోపించారు. గంజాయి రవాణాలో పట్టుబడుతున్న వైసీపీ నాయకులను వదిలివేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.