తిరుమల: తిరుమలలో శుక్రవారం నిర్వహించదలిచిన డయల్యువర్ ఈవో కార్యక్రమాన్ని పరిపాలన పరమైన కారణాల వల్ల రద్దు చేసినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా జూన్ 11న సాయంత్రం 6 గంటలకు తమిళనాడు రాష్ట్రం కరూర్లోని అట్లాస్ కలై అరంగం స్టేడియంలో శ్రీనివాస కల్యాణం వైభవంగా నిర్వహిస్తున్నామని వివరించారు. శ్రీనివాస కల్యాణోత్సవం ప్రాజెక్టు అధికారులు కల్యాణం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు.