అమరావతి : విజయవాడలోని దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం హుండీని ఆలయ అధికారులు లెక్కించారు. 17 రోజులకు సంబంధించిన హుండీ ఆదాయాన్ని ఆలయ ఈవో భ్రమరాంబ పర్యవేక్షణలో సిబ్బంది లెక్కించగా భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ. 3,13,34,270 ఆదాయం వచ్చిందని అధికారులు చెప్పారు. 994 గ్రాముల బంగారం, 7.435 కిలోల వెండి వస్తువులను మొక్కుల రూపంలో చెల్లించుకున్నారని వివరించారు. ఈ – హుండీ ద్వారా 55,623 ఆదాయం వచ్చిందని వెల్లడించారు.